PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముస్లింల అభ్యున్నతిపై.. చిత్తశుద్ధి లేదా…?

1 min read

షాదిఖానా నిర్మాణానికి మంజూరైన నిధులు ఏవీ…?

  • ఎమ్మెల్యే సాయిప్రసాద్​ రెడ్డిని ప్రశ్నించిన కూటమి అభ్యర్థి డా. పార్థసారధి

ఆదోని, పల్లెవెలుగు:నియోజకవర్గంలోని పేద ముస్లిం మైనార్టీలు వివాహాలు, శుభకార్యాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న షాదీఖానా …మొండి గోడలకే పరిమితమైందని, ముస్లింల అభ్యన్నతిని ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి పట్టించుకోవడంలేదని   ఆదోని కూటమి  అభ్యర్థి డా. పార్థసారధి ప్రశ్నించారు. ముస్లిం సోదరుల కోసం షాదీఖానా నిర్మాణానికి మంజూరైన నిధులు ఏమయ్యాయయో చెప్పాలన్నారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్​ రెడ్డి ఒక్కసారైనా షాదీఖానాను పరిశీలించేందుకు వచ్చారా…. అని ప్రశ్నించారు. మొండిగోడలకే పరిమితమైన షాదిఖానాలో…. మందు సీసాలు కనిపిస్తున్నాయని, ఇసుక, సిమెంటు ఎత్తుకుపోయినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, మరి ముస్లింల అభ్యన్నతిపై చిత్తశుద్ధి ఏమాత్రం ఉందో ఇట్టే అర్థం అవుతుందన్నారు. పేద ముస్లిం యువతికి వివాహం జరిగితే దుల్హన్​ పథకం కింద రూ. లక్ష ఇస్తామని చెప్పిన జగన్​ సర్కారు…. ముస్లిం మైనార్టీలను మోసం చేసిందని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి ఆరోపించారు.  హామీ ఇచ్చి… అమలు చేయలేని వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఈ సందర్భంగా ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి ముస్లిం మైనార్టీలకు పిలుపునిచ్చారు. షాదీఖానాను పరిశీలించిన వారిలో గుడిసె కృష్ణమ్మ, జనసేన నాయకులు మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

About Author