PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వరిపంటపై .. ప్రకృతి పంజా..!

1 min read

–– 400 ఎకరాలకు పైగా పంట నష్టం
పల్లెవెలుగువెబ్​, మహానంది: కర్నూలు జిల్లా మహానంది మండలంలో ఆదివారం రాత్రి కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి వరి పంట పూర్తిగా దెబ్బతింది. మండలంలో దాదాపు 400 ఎకరాలకు పైగా పంట దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. మండలంలోని బొల్లవరం, తమ్మడపల్లె బుక్కాపురం, నందిపల్లి, సీతారామపురం, మసీదుపురం గ్రామాల్లో పంట దెబ్బతింది. సోమవారం ఏఓ సుబ్బారెడ్డి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.

అత్యధికంగా బొల్లవరం గ్రామంలో వరి పంట దెబ్బతిందని పేర్కొన్నారు. చేతికి వచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏఓ సుబ్బారెడ్డి మాట్లాడుతూ జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

About Author