PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిద్రిస్తున్న వ్యక్తిపై.. దూసుకెళ్లిన లారీ..

1 min read

– అక్కడికక్కడే మృతి…
పల్లెవెలుగువెబ్​, చాగలమర్రి:మండలంలోని పెద్దబోధనం గ్రామం వద్ద 40 వ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన హుసేన్‌ (49) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు,గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కడప నుండి ఆళ్ళగడ్డ వైపు వెళ్తున్న లారీ (ఏపి 16 టిఈ 5434) డ్రైవర్ నిర్లక్ష్యంతో రోడ్డు దాటి సుమారు వంద మీటర్ల దూరంలో ఉన్న అంతర్గత రహదారి సమీపంలో రేకుల షెడ్డులో మంచంపై ఉన్న హుసేన్‌ మీదికి లారీ దూసుకెళ్ళింది. దీంతో టైర్ల కింద పడి నుజ్జునుజ్జయ్యాడు.

ఆగ్రహించిన గ్రామస్థులు రోడ్ల పై ఆందోళనకు దిగడంతో గంటల కొద్ది ట్రాపిక్‌ స్తంభించింది. విషయం తెలుసుకున్న ఆళ్ళగడ్డ రూరల్‌,టౌన్‌ సిఐలు రాజశేఖరరెడ్డి,కృష్ణయ్యలు,ఎస్‌ఐలు మారుతి, మల్లికార్జున, నరసింహులు ప్రమాద స్థలానికి చేరుకోగానే గ్రామస్థులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ రహదారిపై పది రోజులకోసారి ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ కోపోద్రుక్తులయ్యారు. మృతునికి బార్య,ఇద్దరు సంతానం ఉన్నారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


About Author