NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మరోసారి చర్చలకు ఆహ్వానం

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ ప్రభుత్వ విడుదల చేసిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న పీఆర్సీ సాధన సమితి నేతలను ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలని పిలిచింది. పీఆర్సీ పై ప్రభుత్వ కమిటీతో చర్చలకు రావాలని కోరింది. స్టీరింగ్ కమిటీలోని 20 మంది సభ్యులు చర్చలకు రావాలని పేర్కొంది. పీఆర్సీ సాధన సమితి నేతలు మంత్రుల కమిటీ ముందు ఇప్పటికే తమ డిమాండ్లు ఉంచారు. వాటిపై నిర్ణయం తీసుకుంటేనే చర్చలకు వస్తామని తేల్చిచెప్పారు.

         

About Author