PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ‌రువు త‌గ్గితే కిలోకు వెయ్యి కోట్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియా తన నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కోరిన సంగతి తెలిసిందే. అందుకు కేంద్రమంత్రి గడ్కరీ.. ఉజ్జయిని ఎంపీ అనిల​ ఫిరోజియాకి ఒక షరతు విధించారు కూడా. తాను నిధులు మంజూరు చేయాలంటే ముందు తమరు చాలా బరువు తగ్గండి అప్పుడూ మంజూరు చేస్తానంటూ ఒక కండిషన్‌ కూడా పెట్టారు. ఈ మేరకు గడ్కరీ మాట్లాడుతూ…తాను గతంలో 135 కిలోలు బరువు ఉన్నానని, ప్రస్తుతం 93 కిలోలే ఉన్నానని చెప్పారు. అప్పుడు ప్రజలు త‌న‌ను అసలు గుర్తు పట్టలేకపోయారని తెలిపారు. కాబ‌ట్టి అనిల్ ఫిరోజియా కూడా బరువు తగ్గేందుకు ప్రయత్నించాల‌ని సూచించారు. అంతేకాదు తగ్గిన ప్రతి కిలో బరువుకి వెయ్యి కోట్లు చొప్పున తమ నియోజక వర్గం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తాననంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిరోజియాకి ఒక గొప్ప చాలెంజ్‌ విసిరారు. దీంతో ఫిరోజియా అప్పటి నుంచి తన ఫిట్‌నెస్‌ పై దృష్టి పెట్టడమే కాకుండా బరువు తగ్గేడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ఆయన రకరకాల వ్యాయామాలు కూడా చేసేందుకు సిద్ధమయ్యారు.

                              

About Author