PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

`పీఎం కిసాన్` కేవైసీకి మూడు రోజులే గ‌డువు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతులకు ఈకేవైసీ తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. ఈ పథకం కింద పీఎం కిసాన్ నిధులు పొందడానికి రైతులు ఈకేవైసీ చేసుకోవడానికి మూడు రోజులే గడవు ఉందని కేంద్రం పేర్కొంది. పీఎం కిసాన్ పథకం కింద లబ్ధి పొందే రైతులు ఆగస్టు 31వతేదీలోగా ఈకేవైసీ ఫార్మాలిటీని పూర్తి చేసుకోవాలని కేంద్రం సూచించింది. పీఎం కిసాన్ పథకం కింద ఈకేవైసీ చేసుకునేందుకు ప్రభుత్వం గతంలో జులై 31వతేదీ చివరితేదీ అని ప్రకటించింది. ఈ గడవును ఆగస్టు 31వతేదీ వరకు పొడిగించింది.

                                           

About Author