PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గణితంతోనే..భవిష్యత్​: హరికిషన్​

1 min read

శ్రీ శంకరాస్​ డిగ్రీ కళాశాలలో… గణిత శాస్త్ర దినోత్సవం

పల్లెవెలుగు వెబ్​: విద్యార్థులు ఇష్టపడి.. అర్థం చేసుకుని చదివితే… గణితం సబ్జెక్టు సులభంగా ఉంటుందన్నారు శ్రీ శంకరాస్​ డిగ్రీ కళాశాల డైరెక్టర్​ బి. హరికిషన్​. గురువారం గణిత శాస్ర్త దినోత్సవంను ప్రిన్సిపల్​ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరికిషన్​ మాట్లాడుతూ కొందరు విద్యార్థులు గణితం అంటేనే భయపడుతున్నారని,  చదువులో మెళకువలు పాటిస్తే సులభతరంగా ఉంటుందన్నారు. గణితంతోనే మంచి భవిష్యత్​ ఉంటుందన్న హరికిషన్​.. చదువుతోపాటు ప్రాక్టికల్​ గా రాణించాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రిన్సిపిల్ శ్రీనివాసులు మాట్లాడుతూ  గణిత శాస్ర్తవేత్త రామానుజన్ … గణితం అభివృద్ధికి  చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. విద్యార్థులు గణిత శాస్ర్తంలో రాణించాలని కోరారు. అంతకు ముందు గణిత శాస్ర్తవేత్త రామానుజన్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. .అనంతరం విద్యార్థులకు , క్విజ్, సెమినార్లు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు  బహుమతులు ప్రధానం చేశారు.  కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ అడ్వైజర్ వసంత కుమారి,గణిత శాస్త్ర అధ్యాపకులు మాధవి,బషీర్ ,  సవిత,మధు శేఖర్,ఇంగ్లీష్ అధ్యాపకురాలు సుమలత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author