NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన చర్చి ప్రారంభం..పాల్గొన్న ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పరిశుద్ధ ఆంద్రేయ నూతన చర్చి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగినది.చర్చి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ హాజరయ్యారు.బిషప్ రెవ.ఐజాక్ వర ప్రసాద్, రాయలసీమ డయాసిస్ బిషప్ రెవ.బీడీ ప్రసాద్ బాబు నూతన చర్చిని వారు ప్రారంభించారు.అనంతరం నూతన దేవాలయంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.ఈ కార్యక్రమంలో డీనరీ చైర్మన్ రగడ్డం యోహాను,రాజేంద్ర బాబు,రవికుమార్, సంఘస్తులు మరియు వివిధ గ్రామాల క్రైస్తవులు పాల్గొన్నారు.

About Author