ఆపరేషన్ కగార్ ను ఆపాలి విప్లవకారులతో చర్చలు జరపాలి
1 min read
ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక
విజయవాడ, న్యూస్ నేడు: ఆపరేషన్ కగార్ ను ఆపాలని అదేవిధంగా ఆదివాసుల పైన వారికి నాయకత్వం వహిస్తున్న విప్లవకారులపై సాగిస్తున్న మారణకాండను వెంటనే ఆపివేయాలని ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక డిమాండ్ చేసింది. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆదివాసకుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా చేసిన విలేకరుల సమావేశంలో టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన పోరాకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ పౌర హక్కులను కాల రాస్తున్నారని ఆయన ఆరోపించారు. చత్తీస్గడ్ ప్రాంతంలో గత జనవరి నుండి మావోయిస్టుల అణచివేత పేరుతో అనేక మంది ఆదివాసులను విప్లవకారులను కాల్చి చంపుతున్నారని ఆయన విమర్శించారు. ఒకపక్క ఆదివాసులకు నాయకత్వం ఇస్తున్న విప్లవకారులు, పౌర హక్కుల సంఘ నేతలు చర్చలకు సిద్ధమని అనేక విజ్ఞప్తులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ఆదివాసుల హనానానికి పాల్పడుతుందని అన్నారు. అనంతరం ప్రజా సంఘ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంలో ఉన్న ఖనిజ సంపదను దారా దత్తం చేసేందుకు ఆపరేషన్ కగార్ ను ప్రారంభించిఃదని అన్నారు. పౌర హక్కుల ను కాపాడుతామని రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఫలానా తేధిల్లో మొత్తం విప్లవకారులని హతమార్స్తామని అనడం ఆప్రజాస్వామ్యకమని వ్యక్తులు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి ఆదివాసులకు నాయకత్వం ఇస్తున్న విప్లవ కారులతో శాంతి చర్చలు జరిపి ఆదివాసులపై జరుగుతున్న మారణకాండను ఆపివేయాలని అన్నారు. ఆదివాసుల హక్కుల సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు నాయకులు పొలారి,సినియర్ జర్నలిస్ట్ డాని,ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్,ఐఎపిల్ మెంబర్ పిచ్చుక శ్రీనివాస్, కే ఎన్ పి ఎస్ కృష్ణ, చైతన్య మహిళా సంఘం లక్ష్మి,ఐఎఫ్టీయు నాయకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
