PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

32 మంది కంటి రోగులకు ఆపరేషన్లు

1 min read

పల్లెవెలుగు వెబ్​, అన్నమయ్య జిల్లా రాయచోటి: రాయచోటి మండల పరిధిలోని చెన్నముక్కపల్లె గ్రామ పంచాయతీలో గల లయన్స్ కంటి ఆసుపత్రిలో ఆదివారం జరిగిన కంటి వైద్య శిబిరంలో 32 మంది కంటి రోగులకు ఆపరేషన్లు నిర్వహించారు.ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గంలోని ఆరు మండలాలతో పాటు అన్నమయ్య జిల్లాలోని  రాజంపేట, రైల్వేకోడూరు, యర్రావారిపాలెం, కలకడ,పీలేరు, గుర్రంకొండ, పెద్దమండ్యం, ఎన్.పి.కుంట, చక్రాయపేట తదితర ప్రాంతాల నుండి వచ్చిన 60 మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు అందులో అర్హులైన 32 మంది కంటి రోగులకు ఆపరేషన్ చేపట్టారు.అలాగే గతంలో ఆపరేషన్ చేయించుకున్న 40 మంది కంటి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు,మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కంటి ఆసుపత్రి చైర్మన్ వైవిఆర్ స్వరూప గుప్త,మార్కెట్ కమిటీ చైర్మన్ లయన్ చెన్నూర్ అన్వర్ భాషా,ఏపీఐఐసీ డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి,ఎంపీటీసీ రామచంద్రారెడ్డి,కంటి వైద్యులు సురేష్ బాబు,మహాలక్ష్మి,భార్గవి,శశిబిందు,ఆఫ్త మాలిక్ అసిస్టెంట్ రాజగోపాల్ రెడ్డి,ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author