NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గణతంత్ర వేడుకల్లో విభిన్న ప్రతిభావంతులకు అవకాశం

1 min read

– విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ పి.విజయ
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2022 జనవరి 26వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో హాజరయ్యేందుకు ప్రత్యేక ప్రతిభ గల విభిన్న ప్రతిభావంతులు తమ వివరాలను రెండు రోజుల్లో అందజేయాలని కోరారు కర్నూలు జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ పి. విజయ. ఆసక్తి , అర్హత ఉన్న వారు రాష్ట్ర ప్రభుత్వానికి పంపే ప్రతిపాదలను కలెక్టరేట్​లోని తమ కార్యాలయంలో అందజేయాలని కోరారు. మరిన్ని వివరాలకు కార్యాలయం ఫోన్​నం. 08518​–277864 ను సంప్రదించాలని కోరారు.

About Author