PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పులివెందుల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత నియోజ‌కవ‌ర్గం పులివెందుల‌లో వైసీపీకి చెందిన 15 కుటుంబాలు గురువారం టీడీపీలో చేరాయి. ఈ సంద‌ర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ ర‌వి, టీడీపీ క‌డ‌ప జిల్లా అధ్య‌క్షుడు శ్రీనివాస‌రెడ్డిలు వారిని టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పులివెందుల‌లో బీటెక్ ర‌వి, శ్రీనివాస‌రెడ్డిల ఆధ్వ‌ర్యంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వ‌హించాయి. సీఎం జ‌గ‌న్‌మ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లోనే ఆయ‌న‌కు వ్య‌తిరేకత‌ పెరుగుతోంద‌ని బీటెక్ ర‌వి అన్నారు.

                                             

About Author