PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆపస్ కడప జిల్లా కార్యవర్గం ఎన్నిక…    

1 min read

పల్లెవెలుగు వెబ్ కడప:  కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా ఎస్ చెన్నయ్య , ప్రధాన కార్యదర్శిగా దేవి రెడ్డి కొండ రెడ్డి, కోశాధికారిగా శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా శ్రీ సంజీవరెడ్డి, బాల నాయుడు వ్యవహరించగా పరిశీలకులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు జీవీ సత్యనారాయణ హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్. శ్రావణ కుమార్ నూతన కార్యవర్గాన్ని అభినందిస్తూ సంఘ అభివృద్ధి తో పాటు సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పూర్వపు అధ్యక్షులు ఏ. వెంకట్రామిరెడ్డి రాష్ట్ర బాధ్యులు సిహెచ్ రామాంజనేయ ప్రసాద్ ఎస్ రామ్మోహన్ రెడ్డి, ఎరుకల రెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షులు బి సుబ్బరాయుడు మరియు అన్ని మండలాల బాధ్యులు పాల్గొన్నారు.

About Author