NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఓపీఎస్ అమలుపర్చాలి… ఆపస్ డిమాండ్ 

1 min read

పల్లెవెలుగు వెబ్ కనిగిరి: ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు తక్షణమే సిపిఎస్ ను రద్దుచేసి ఓపిఎస్ అమలు పరచాలని ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్. శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. కనిగిరిలోని నాలుగో వార్డ్ పాటశాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జోనల్  సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ  సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడుకె.మల్లికార్జున రావు మాట్లాడుతూ ప్రభుత్వం సంపాదిత సెలవు,  పి.యఫ్ రుణాలు, ఇతర బకాయిలు నెలాఖరు లోపు చెల్లించాలని కోరారు ఈ సమావేశంలో జోనల్ బాధ్యులు ఏవి నారాయణ కనిగిరి మండలం బాధ్యులు కే రవిశంకర్ ఆర్ పవన్, బి రాము తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కనిగిరి మండలంలో సభ్యత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పాతపాడు కంచర్ల వారి పల్లి లింగారెడ్డిపల్లి చింతలపాలెం చాకిరాల నాలుగవ వార్డు కనిగిరి పాఠశాలను సందర్శించడం జరిగింది.

About Author