PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలిసిన ఆపస్

1 min read

పల్లెవెలుగు,వెబ్ ఒంగోలు: ఒంగోలులో నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ శ్రావణ కుమార్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం బృందం కలసి వారిని సత్కరించి భరతమాత చిత్రపటాన్ని బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా మార్చి 5న నెల్లూరులో జరగనున్న ఆపస్ రాష్ట్ర మహాసభలకు ముఖ్యఅతిథిగా విచ్చేసి మార్గదర్శనం చేయవలసిందిగా వారిని అభ్యర్థించడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఉపాధ్యాయులు విద్యార్థులలో సత్ప్రవర్తన నైతిక విలువలు పెంపొందించడానికి దోహదపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే మల్లికార్జునరావు, టి దిలీప్ చక్రవర్తులు పాల్గొన్నారు.

About Author