PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గవర్నర్ కు ఆపస్ వినతి..

1 min read

పల్లెవెలుగు, వెబ్​ విజయవాడ: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విధంగా ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధనకు కృషి చేసి ఇప్పటివరకు నిలిచిపోయిన ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని ప్రమోషన్లను కల్పించాలని ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సి హెచ్ శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ యస్ బాలాజీ, రాష్ట్ర సహాధ్యక్షులు యస్ రామ్మోహన్ రెడ్డి , రాష్ట్ర కోశాధికారి యం సురేష్ కుమార్, ఆపస్ జిల్లా నాయకులు రాజగోపాలాచార్యులు, చంద్రశేఖర్ లతో కలిసి రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వ భూషన్ హరి చందన్ గారికి విన్నవించడం జరిగింది.అలాగే ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కు ఏ పి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో శాశ్వత సభ్యత్వం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

About Author