PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆరంజ్ అల‌ర్ట్.. భారీ వ‌ర్షాలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మ‌హారాష్ట్ర‌లోని తీరప్రాంత కొంకణ్‌లో రాబోయే ఐదు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ మంగళవారం తెలిపింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీవర్షాల వల్ల మహారాష్ట్రలోని రెండు జిల్లాల్లో భారీ వరదలు వెల్లువెత్తే అవకాశాలుండటంతో తీరప్రాంత కొంకణ్‌లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం రెండు బృందాలను మోహరించినట్లు ఒక అధికారి తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం రత్నగిరి జిల్లాలోని చిప్లూన్‌లో,మరో బృందం రాయ్‌గఢ్ జిల్లాలోని మహద్‌లో ఉంది.

                                  

About Author