PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా ఉస్మాన్ బాషా

1 min read

– సామాన్య రైతుకు పట్టం కట్టిన శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి.

-నమ్ముకున్న కార్యకర్తలకు శాప్ చైర్మన్ సముచిత స్థానం కల్పిస్తారు.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:     ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో,శాప్ చైర్మన్,రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సహకారంతో ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బుధవారం జారీ చేసిన ఉత్తర్వులలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ కమిటీ నూతన డైరెక్టర్ గా లక్ష్మాపురం గ్రామానికి చెందిన షేక్ ఉస్మాన్ బాషా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఉస్మాన్ మాట్లాడుతూ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు సమీక్షిత స్థానం కల్పిస్తారని దానికి తానే నిదర్శనమని అన్నారు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన తనకు మార్కెట్ యార్డు డైరెక్టర్గా నియమించినందుకు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి,పగిడ్యాల మాజీ జెడ్పిటిసి సభ్యులు పుల్యాల నాగిరెడ్డి జెసిఎస్ పట్టణ కన్వీనర్ అబుబక్కర్,నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ భర్త మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ జబ్బార్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు నూతన డైరెక్టర్ ఉస్మాన్ బాషా తెలిపారు.

About Author