NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మా నమ్మకం నువ్వే జగన్’లో నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో గురువారం సాయంత్రం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదేశాల మేరకు మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని వైసీపీ సమాచార సాంకేతిక విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వానికి ఈప్రభుత్వానికి ఉన్న తేడా గురించి వివరిస్తూ ఇంటి యజమానుల అనుమతి మేరకు ప్రతి ఇంటికి మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లను ఆయన అతికించారు.రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వాన్ని దీవించాలని ఆయన ప్రజలను కోరారు.అదేవిధంగా తిమ్మాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ చింతకుంట నాగసామిరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఆయన స్టిక్కర్లను అతికించారు.ఈకార్యక్రమంలో గ్రామ వైసిపి నాయకులు పి.బలరాముడు,మాజీ సర్పంచ్ మండ్ల వెంకటరమణ,ఎస్ సుదర్శన్ రెడ్డి,ఎం శ్రీనివాసులు,సోషల్ మీడియా మండల కో కన్వీనర్ రామాంజనేయులు,సాంబశివుడు,షేక్ అహ్మద్,హరీష్,మునిదాసు,పి.సామేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

About Author