PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు ప్రజలకు మా సహకారం ఎప్పుడూ ఉంటుంది : టి.జి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలో అభివ్రుద్ది కార్యక్రమాలకు మా టీజీవీ సంస్థల తరుపున ఎప్పుడైనా సహాయ సహకారాలు అందిస్తామని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. గురువారం నగరంలోని 25వ వార్డు పరిధిలోని బిర్లాగడ్డలో శివసాయి రామాంజనేయస్వామి దేవాలయంలో బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ గోపురం, గుడి ప్రాంగణం, ముఖద్వారంతో పాటు ఆర్చ్ కు పెయింటింగ్ పనుల కోసం టీజీవీ సంస్థల నుండి రూ. 2,50,000( రెండు లక్షల యాబైవేల రూపాయలు) విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా టిజి భరత్ మాట్లాడుతూ మంచి కార్యక్రమంలో భాగమవ్వడం సంతోషంగా ఉందన్నారు. కర్నూలు నగరంలోని దేవాలయాలు, చర్చిలు, మసీదులకు తమ టిజివి సంస్థల తరుపున అవసరమైన సహకారం అందిస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మద్దిలేటి, మధు, సత్యరాజు, సీనియర్ నేతలు నాగరాజుయాదవ్, గున్నా మార్క్, వార్డు ఇంచార్జి రాజశేఖర్ యాదవ్, మహేష్, సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.

About Author