NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గడప గడపకు మన ప్రభుత్వం

1 min read

– అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న ప్రభుత్వం లక్ష్యం

– 12వ వార్డ్ లో సాయంత్రం కొనసాగిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం

– కర్నూల్ నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తున్నామని  కర్నూల్ నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు అన్నారు. కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలు నియోజకవర్గ పరిధిలోని, 12వ వార్డులోని 29వ సచివాలయం పరిధిలో సాయంత్రం వడ్డే గేరి లో, కే.వి.ఆర్ గార్డెన్స్ లోని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగింది. ఎమ్మెల్యే గారు కాలనీలోని ప్రతి గడపకు వెళ్లి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న జనరంజక పాలన,అవినీతి రహిత పాలన గురించి ప్రజలకు వివరిస్తూ జగనన్న ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి అందేలా చూడాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. కర్నూలు ఎమ్మెల్యే హాసిజ్ ఖాన్ గారి దృష్టికి పలు సమస్యలను వివరించిన స్థానిక ప్రజలు వెంటనే అధికారులకు ఫోన్ చేసి అప్పటిపడే ఎమ్మెల్యే పరిష్కారం చేసారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రజా సమస్యలు పట్టమని కేవలం రాజకీయ మాత్రమే కావాలని అయితే తాము కేవలం ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానున్నారు. అందుకే నిరంతరం ప్రజాక్షేత్రంలోని ఉంటామన్నారు. ప్రజలకున్న సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నామని  ఈ సందర్భంగా ఎమ్మెల్యే  తెలిపారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డ్ నాయకులు నవీన్ , కో-ఆప్షన్ మెంబెర్ నయీమ్ పాషా ,చాట్ల మరి హనీఫ్ ,షైక్ షా గారు, శ్రీను గారు,కన్వీనర్లు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author