PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సేవే మా లక్ష్యం…

1 min read

శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ 

ట్రస్ట్ చైర్మన్ కూన ఈశ్వర్ రెడ్డి కి ఘనంగా సన్మానం,,

పల్లెవెలుగు వెబ్  వల్లూరు : సేవే మా లక్ష్యం అంటూ ఏదో ఒక రూపాన సేవలందిస్తూ పేద ప్రజలకు, యాచకులకు, అనాధలకు అండగా నిలుస్తూ సేవా భావంతో అన్నదానంతో పాటు పలు రకాల సేవలు అందిస్తున్న శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన ఈశ్వర్ రెడ్డి కి ఘనంగా సన్మానం, కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచమంతా భయపడి, కుటుంబంలో మనిషి చనిపోతే కుటుంబ సభ్యులే దగ్గరికి రాని టైంలో నేనున్నానంటూ శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు చేయడం అభినందనీయం, ఇలా ఆయన సేవలను గుర్తించి, అంతర్రాజతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా కడప పట్టణంలో ఆల్ షిఫా సేవా సంస్థ, యష్ ఆర్ పి సేవా సంస్థ ఆధ్వర్యంలో, సేవకుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి వల్లూరు మండలం బీచువారిపల్లిలోని శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన ఈశ్వర్ రెడ్డిని ఆత్మీయ సమ్మేళనం కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి ప్రశంస పత్రం అందజేశారు, ఈ సందర్భంగా కూన ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సేవే నా లక్ష్యం, నేను సేవ చేయడం నాకు దేవుడిచ్చిన వరంల భావిస్తున్నాను అన్నారు, నాకు సన్మానం, ప్రశంసా పత్రం అందజేయడం వలన, నాకు మరింత ఉత్సాహంగా, సేవ నా లక్ష్యంగా భావిస్తూ ముందుకెళ్లేందుకు అని అన్నారు.

About Author