PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో లక్ష దాటిన కేసులు !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ లో కరోన విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 46,929 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 13,819 కరోన కేసులు నమోదయ్యాయి. కరోన వల్ల చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఇద్దరేసి మృతి చెందగా.. ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కరోన బారి నుంచి సోమవారం 5,176 మంది పూర్తీగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 101396 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్ లో తెలిపింది. అత్యధికంగా విశాఖపట్నంలో 1988 కేసులు నమోదు అయ్యాయి. కరోన వల్ల ఇప్పటి వరకు 14,561 మంది మరణించారు.

      

About Author