NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆక్సిజ‌న్ లీక్: 22 మంది మృతి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: మ‌హారాష్ట్రలోని నాసిక్ లో దారుణం జ‌రిగింది. ఆక్సిజ‌న్ లీకై 22 మంది రోగులు మృత్యువాత‌ప‌డ్డారు. నాసిక్ లోని జాకీర్ హుస్సేన్ హాస్పట‌ల్ లో వెంటిలేట‌ర్ మీద 23 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఆక్సిజ‌న్ లీక్ అవ్వడంతో.. వెంటిలేట‌ర్ మీద ఉన్న రోగుల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా ఆగిపోయింది. దీంతో 22 మంది రోగులు ఆక్సిజ‌న్ అంద‌కపోవ‌డంతో చ‌నిపోయారు. ప్రస్తుతం ఆక్సిజ‌న్ ట్యాంక్ లో 25 శాతం ఆక్సిజ‌న్ మాత్రమే ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఆక్సిజ‌న్ లీక్ కు కార‌ణ‌మైన వారిని క‌ఠినంగా శిక్షిస్తామ‌ని నాసిక్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ కైలాష్ జాద‌వ్ తెలిపారు. నిపుణుల స‌హాయంతో ఆక్సిజ‌న్ లీకేజీని అరిక‌ట్టామ‌ని తెలిపారు.

About Author