PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆక్సిజనే.. జీవనాధారం..

1 min read

– జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్​ ప్రెసిడెంట్​ వై. నాగేశ్వర రావు
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : మనిషికి ఆస్తులు లేకపోయినా.. బతకగలమని, ఆక్సిజన్​ లేకుంటే చనిపోతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్​ ప్రెసిడెంట్​ వై. నాగేశ్వర రావు వై. నాగేశ్వర రావు యాదవ్​ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం నాగేశ్వర రావు దంపతులు వారి నివాస ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు యాదవ్​ మాట్లాడుతూ సహజసిద్ధమైన ప్రాణవాయువు లభించక ఎంతో మంది కోవిడ్​కు ప్రాణాలు వదిలారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్​ వస్తువులను ఉపయోగించరాదని ఈ సందర్భంగా నాగేశ్వర రావు యాదవ్​ ప్రజలకు సూచించారు.

About Author