PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగుల‌కు ఓయో బంప‌ర్ ఆఫర్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఓయో ఉద్యోగుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. వినియోగదారులకు హోటల్‌ రూములను అందించే ఆతిథ్య రంగ కంపెనీ ఓయో.. ఉద్యోగులకు షేర్లను జారీ చేసింది. కంపెనీ ప్రస్తుత సిబ్బంది సహా మాజీ ఉద్యోగులు సైతం షేర్లను సొంతం చేసుకున్నట్లు ఓయో తాజాగా తెలియజేసింది. ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్‌లో భాగంగా 3 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఓయో మాతృ సంస్థ ఒరావెల్‌ స్టేస్‌ లిమిటెడ్‌ పేర్కొంది. ఇసాప్‌ల మార్పిడి ద్వారా ఉద్యోగులు ఈక్విటీ షేర్లను పొందినట్లు వెల్లడించింది. ఓయో త్వ‌ర‌లో ప‌బ్లిక్ ఇష్యూకి రానుంది.

                                                    

About Author