PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాద‌యాత్ర…అరాచ‌క స‌ర్కారుపై జ‌నజైత్రయాత్ర‌

1 min read

-ప్రత్యేక సంచిక ఆవిష్కరించిన లోకేష్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: యువ‌గ‌ళం పాద‌యాత్ర అరాచ‌క స‌ర్కారుపై జ‌న‌జైత్రయాత్రగా చ‌రిత్రలో నిలిచిపోతుంద‌ని టిడిపి నేత‌లు పేర్కొన్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం వందరోజులు పూర్తయిన సంద‌ర్భంగా పాద‌యాత్ర  విశేషాల‌తో టిడిపి నేత కేశినేని శివ‌నాథ్(చిన్ని) ప్రత్యేక సంచిక తీసుకొచ్చారు.   శ్రీశైలం నియోజ‌క‌వ‌ర్గం బోయరేవుల క్యాంప్ సైట్ వ‌ద్ద సోమ‌వారం యువ‌నేత నారా లోకేష్ ప్రత్యేక సంచిక “జ‌న‌హృద‌య‌మైనారా లోకేష్‌“ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, మాజీ మంత్రి రావుల చంద్రశేఖ‌ర్ రెడ్డి, మాజీ మంత్రి పీత‌ల సుజాత‌, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి , శ్రీశైలం నియోజ‌క‌వ‌ర్గం టిడిపి ఇన్చార్జి బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి, టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు, డూండి రాకేష్, యువగళం మీడియా కోఆర్డినేటర్ బీవీ. వెంకట రాముడు, భాష్యం ప్రవీణ్‌, టిడిపి నేత‌లు పాల్గొన్నారు.

About Author