PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పద్మశాలీలు.. ఉత్తమ సేవకులు..

1 min read

పదవీ విరమణ పొందిన 17 మందికి POPA ఆధ్వర్యంలో ఘన సన్మానం

  • మీ అనుభవం… భావితరాలకు ఉపయోగపడాలని సూచించిన ఎంపీ డా. సంజీవ్​ కుమార్​

కర్నూలు, పల్లెవెలుగు: రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ… ఇటీవల పదవీ విరమణ పొందిన పద్మశాలీల కుటుంబ సభ్యులను ఆదివారం కర్నూలు పద్మశాలీ అఫిషియల్స్​ మరియు ప్రొఫెషనల్స్​ అసోసియేషన్​( POPA) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నగరంలోని ఆయుష్మాన్​ హాస్పిటల్​ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ డా. సంజీవ్​ కుమార్​ పదవీ విరమణ పొందిన 17 మందికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ  ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని, కానీ పదవీ విరమణ తరువాత మీ అనుభవం.. ఆలోచనలు, సేవలు.. భావితరాలకు ఉపయోగపడాలని సూచించారు. ప్యాపిలి చంద్రశేఖర్, పద్మశాలి అధ్యక్షులు కస్తూరి వేమయ్య , మరియు popa సభ్యులు,  Dr. శింగరి గంగాధర్,Dr. యస్.అచ్యుతరావు,N.కేశవయ్య, కాకర్ల శేషాద్రి,కస్తూరి ప్రసాద్ క, కార్యదర్శి గోవిందు, మేడం సుంకన్న,,శిరిసాల లక్ష్మీనారాయణ, జేరుబండి హరిప్రసాద్, దండు శ్రీహరి, పులిపాటి జగన్ , కాల్వ సంజీవ్,B.శ్రీనివాసులు అడ్వకేట్ గుద్దేటివేణు,బోగారామయ్య   Z.P.ఆంజనేయులు,శ్రీసోమనాథ్ లెక్చరర్ తదితరులు పాల్గొన్నారు.

కృతజ్ఞతలు..

కర్నూలు పద్మశాలీ అఫిషియల్స్​ మరియు ప్రొఫెషనల్స్​ అసోసియేషన్​( POPA) కు ఎనలేని సేవలు చేసిన డైరెక్టర్స్​ కాకర్ల శాంతి కుమార్​, బోడా రమేష్​ (ప్యాపిలి)కు పద్మశాలి అధ్యక్షులు కస్తూరి వేమయ్య , సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  వీరు సేవలు కొనసాగిస్తూ… పోపాను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని సభ్యులు ఆకాంక్షించారు.

About Author