PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పద్మశాలియులు.. ఆర్థికంగా ఎదగాలి

1 min read

ఆదోని పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు లక్ష్మన్న

  • కుల బాంధవుల సమక్షంలో క్యాలెండర్​ ఆవిష్కరణ

ఆదోని, పల్లెవెలుగు: పద్మశాలీలు ఆర్థికంగా.. సామాజికంగా.. రాజకీయంగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఆదోని పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు లక్ష్మన్న. ఆదివారం సాయంత్రం స్థానిక భక్త మార్కెండేయ స్వామి దేవాలయ ఆవరణలో పద్మశాలీయుల కుల బాంధవుల సమక్షంలో ఆయన పద్మశాలీల నూతన సంవత్సర (2024) క్యాలెండర్​ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు లక్ష్మన్న మాట్లాడుతూ కులస్తులందరూ ఐక్యత మెలిగి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  ఫిబ్రవరి మాసంలో శ్రీ భక్త మార్కెండేయ స్వామి జయంతి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పద్మశాలీలందరూ  స్వామి జయంతి ఉత్సవంలో పాల్గొని జయ ప్రదం చేయాలని ఈ సందర్భంగా పద్మశాలీ సేవా సంఘం అధ్యక్షుడు లక్ష్మన్న పిలుపునిచ్చారు. కార్యక్రమంలో  పద్మశాలీ సేవా సంఘం సబ్యులు గడ్డం హంపయ్య, గోరంట్ల నారాయణ మూర్తి, మేడం నాగరాజు, చిలక శేఖర్​, నరాల రామాంజనేయులు, కాంచనం గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.

About Author