PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూల్ నగర అధ్యక్షునిగా పగిడాల మౌలాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరం ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ నందు కార్యకర్తల సమావేశము నిర్వహించడం జరిగినది ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల కన్వీనర్ అక్బర్ హుస్సేన్ మరియు కర్నూల్ జిల్లా కన్వీనర్ షేక్ మొహమ్మద్ రఫీ మరియు రాయలసీమ జోన్ కన్వీనర్ బివి సుబ్బారెడ్డి మరియు కర్నూల్ పార్లమెంట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు అందరూ సమావేశమై కార్యకర్తలందరూ ఏకగ్రీవంగా కర్నూల్ నగర కార్పొరేషన్ ఆమ్ ఆద్మీ పార్టీ కర్నూల్ నగర అధ్యక్షునిగా పగిడాల మౌలాలి గారిని కార్యకర్తలు సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. మరియు కర్నూలు జిల్లా లీగల్ సెల్ చంద్రగిరి సురేష్ బాబా గారిని నాయకులు కార్యకర్తలు అందరూ పార్టీ ఆఫీసు నందు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.

About Author