PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భార‌త్ కు పాక్ స‌హాయం..!

1 min read

Pakistan and India flag together realtions textile cloth fabric texture

ప‌ల్లెవెలుగు వెబ్​ : క‌రోన మ‌హ‌మ్మారి భార‌త‌దేశాన్ని ప‌ట్టిపీడిస్తున్న సంద‌ర్భంలో దాయాది దేశం పాకిస్థాన్ స‌హాయం చేసేందుకు ముందుకు వ‌చ్చింది. భార‌త్ కు అవ‌స‌ర‌మైన వెంటిలేట‌ర్లు, డిజిట‌ల్ ఎక్స్ రే యంత్రాలు, పీపీఈ కిట్లు అందించేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మ‌హ‌మ్మద్ ఖురేషి ట్విట్టర్ లో వెల్లడించారు. భార‌త్ కు వైద్య సామాగ్రి స‌ర‌ఫ‌రా చేసేందుకు ఇరుదేశాల అధికారులు ముందుకు రావాల‌ని కోరారు. క‌రోన మీద పోరాటంలో ఏ విధ‌మైన అవ‌కాశాలు ఉన్నా వాటి కోసం అన్వేషించాల‌ని అన్నారు. క‌రోనాతో పోరాడుతున్న భార‌త్ కు ఆయ‌న సంఘీభావం ప్రక‌టించారు.

About Author