NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేలుళ్లకు పాక్ కుట్ర.. ఆరుగురు ఉగ్రవాదులు అరెస్ట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : పాక్ ఐఎస్ఐ ప్రేరేపిత ముష్కర గ్రూపు పండుగ పూట పేలుళ్లకు కుట్రప‌న్నింది. ఈ కుట్రల‌ను ఢిల్లీ పోలీసులు భ‌గ్నం చేశారు. పాక్ ఐఎస్ఐ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఆరుగురు ఉగ్రవాదుల‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దేశంలో రాబోయే పండుగ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు కుట్రపన్నిన‌ట్టు పోలీసులు వెల్లడించారు. నిఘా వ్యవ‌స్థల స‌మాచారంతో అప్రమ‌త్తమైన పోలీసులు రాజ‌స్థాన్ లో ఒక‌రిని, యూపీలో ముగ్గురిని, ఢిల్లీలో ఇద్దరిని చాక‌చ‌క్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరుగురిలో ఇద్దరు పాకిస్థాన్ లోని ఓ ఫాం హౌస్ లో ఆయుధాల వినియోగం పై శిక్షణ కూడ తీసుకున్నార‌ని పోలీసులు తెలిపారు.

About Author