NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పల్లెవెలుగు న్యూస్ ఎఫెక్ట్….

1 min read

– మూడు నెలల నుండి అందని రేషన్.. కథనానికి స్పందించిన అధికారులు..

పల్లెవెలుగు వెబ్ గడివేముల: రేషన్ బండి రావడం లేదంటూ పల్లె వెలుగు న్యూస్ లో వచ్చిన కథనానికి స్పందించిన నంద్యాల జిల్లా సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ ప్రసాదరావు శనివారం నాడు స్థానిక రేషన్ డీలర్ ఎండియూ ఆపరేటర్ ను విచారించారు తూనికల్లో తేడా రావడం తో తాను భరించలేను అంటూ డీలర్ .ఎం డి యూ ఆపరేటర్ ను రోజు తీసుకువెళ్లే బియ్యం తూకం వేసుకొని వెళ్లాలని చెప్పడంతో నిరాకరించిన ఆపరేటర్ గత మూడు నెలల నుండి లబ్దిదారులకు రేషన్ బియ్యం అందజేయటం ఆపేశాడు దీనిపై మహిళలు డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడంతో సమాచారం అందుకున్న సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్  విచారణ చేసి  లబ్ధిదారులకు ప్రతినెల రేషన్ బియ్యం అందేటట్టు చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ ప్రసాదరావు తెలిపారు.

About Author