PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హోరా హోరిగా పెరిగిన పంచాయతీ ఆదాయం!

1 min read

– పంచాయతీ వేలంపాటలో మాట్లాడుతున్న డీఎల్పీఓ నూర్జహాన్
పల్లెవెలుగు వెబ్ కౌతాళం: స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్ పాల్ దినకర్,ఉప సర్పంచ్ సక్రి తిక్కయ్య,అద్యక్షతన, డిఎల్పివో నూర్జహాన్,సెక్రెటరీ నాగరాజు,పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్, ఆధ్వర్యంలో 2023-24 సంవత్సరానికి గాను పంచాయతీ వేలాలు నిర్వహించారు. ఈ వేలం పాటలో గత ఏడాది కంటే ఈ ఏడాది పంచాయతీ ఆదాయం 1,86,000వేలు పెరిగింది.దినసరి సంత18500, లకు వడ్డే గురురాజా,కమేళ 34,000 లకు ఈడిగ వసంత బండి మెట్ట 4,250,00 లకు ఈడిగ వసంత,వేలం పాటలో దక్కించుకున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 1,86,000 అధికంగా వచ్చినట్లు పంచాయతీ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.వేలం పాట లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌతాళం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి,సిబ్బంది తో కలిసి గట్టి బందోబస్తు నిర్వహించారు.

About Author