PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లంచం లేనిదే మంచం ఎక్కని పంచాయితీ సెక్రెటరీ రామ్మూర్తి

1 min read

– అఖిల భారత యువజన సమాఖ్య AIYF
పల్లెవెలుగు వెబ్ ఆస్పరి: ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలోని పంచాయతీ ఆఫీస్ లో సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న రామ్మూర్తి గారిని సస్పెండ్ చేయాలని అఖిలభారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ ఆస్పరి మండల కార్యదర్శి రమేష్ సిపిఐ సీనియర్ నాయకుడు వెంకటేష్ మాట్లాడుతూ ప్రజలు సమస్య అని ఆఫీస్ కి వెళ్తే ఒక్కో సమస్యకు ఒక్కో విధంగా లెక్క కట్టి ప్రజలతో లంచాలు తీసుకొని పేద ప్రజలను హింసిస్తు అదే విధంగా గ్రామంలో అధికారంలో ఉన్న YSRCP నాయకులకు తోత్తుగా వ్యవహరిస్తూన్నాడు.ఈ విషయం తెలుసుకుని సీపీఐ ఉప సర్పంచ్ స్వాతి గారు గ్రామ ప్రజలతో కలిసి ఆఫీస్ కి వెళ్లి అడిగితే ఆమెను అసభ్యకరమైన మాటలతో ఆమెను అవమానించాడు.ఈ విధంగా లంచాలు తీసుకొని విధులు నిర్వహిస్తున్న సెక్రెటరీ ని విధుల నుంచి తొలిగించాలని ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రజలను యువతను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి రాజేశేకర్ గ్రామ ఉపసర్పంచ్ స్వాతి ఏఐవైఎఫ్ నాయకులు ధనుంజయ రెవన్ తదితరులు పాల్గొన్నారు.

About Author