PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పారా మెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: 19 సంవత్సరాల నుండి రెగ్యులర్ పోస్టులలో రూల్ అఫ్ రిజర్వేషన్స్ dsc ద్వారా నియమించబడిన పారామెడికల్ ఉద్యోగుల సర్వీస్ రెగ్యులర్ చేయాలని రాష్ట్ర హెల్త్​ డైరెక్టర్​ డా. టి. గీత ప్రసాదిని కోరారు ysr మెడికల్ &హెల్త్ యూనియన్ అధ్యక్షులు కరుణానిధి , ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ చిన్న రాముడు , కర్నూలు జిల్లా గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ dr రఘురామి రెడ్డి . శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆమెను జిల్లా కాంట్రాక్టు పారామెడికల్ ఐక్య వేదిక నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ysr మెడికల్ &హెల్త్ యూనియన్ అధ్యక్షులు కరుణానిధి మాట్లాడుతూ పారామెడికల్​ ఉద్యోగులను రెగ్యులర్​ చేయాలని, 27 జీఓను సవరించి టైం స్కేల్ ఇవ్వాలని, త్వరలో జరుగబోవు ట్రాన్స్ఫర్ లలో కాంట్రాక్టు ఉద్యోగులకు అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ లు ఫరూక్, లక్సన్న, రంగన్న, మురళీధర్, రామాంజినేయులు పాల్గొన్నారు.

About Author