NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తల్లిదండ్రుల ఎన్నిక నోటిఫికేషన్ విడుదల…

1 min read

పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ: ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తల్లిదండ్రుల కమిటీ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ పాఠశాలకు వచ్చిందని దేవనబండ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొత్తపల్లి సత్యనారాయణ తెలిపారు. గురువారం పత్తికొండ మండల పరిధిలోని దేవనబండ గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు. నోటిఫికేషన్ కి సంబంధించిన జీవో కాపిని చూపించారు. పాఠశాలల్లోనే ఒకటో తరగతి నుండి ముగ్గురు సభ్యుల ప్రకారం మొత్తము ఐదు తరగతులకు 15 మంది సభ్యులను ఎన్నుకోవాలి ఉంటుందని సత్యనారాయణ తెలిపారు. ఈ ఎన్నికను 22 -9 -2021వ తేదీన ఎన్నిక జరుగుతుందని తెలిపారు .ఎన్నుకున్న 15 మంది సభ్యులు చైర్మన్ వైస్ చైర్మన్ లను ఎన్నుకుంటారని తెలిపారు. వీరితో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఒక టీచర్ ఒక వార్డు సభ్యుడు అంగన్వాడీ కార్యకర్త ఏఎన్ఎం మహిళా సమైక్య సభ్యురాలు మరియు ఇద్దరు కో అప్డేడ్ సభ్యులుగా నియమితులు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ఉపాధ్యాయులు నాగేటి ప్రసాద్ , సులోచనమ్మ, లలిత, తదితరులు పాల్గొన్నారు.

About Author