PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భానుశంకర్​కు..‘మంత్రాలయ పరిమళ ప్రశస్తి’ అవార్డు

1 min read

సాఫ్ట్​వేర్​ రూపకల్పనలో కీలకపాత్రకు..గుర్తింపు

  • శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు ప్రశంస..

కర్నూలు, పల్లెవెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో ఆధునిక టెక్నాలజీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన భాను శంకర్​కు ఆదివారం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు చేతుల మీదుగా ‘మంత్రాలయ పరిమళ ప్రశస్తి’ అవార్డును బహుకరించారు. ఇన్​ఫర్మేషన్​ టెక్నాలజీ ద్వారా ప్రజలకు సేవలు అందించినందుకుగాను అవార్డు అందజేసినట్లు శ్రీమఠం పీఠాధిపతులు ప్రశంసించారు. భానుశంకర్​ వివిధ స్థాయిలో కేంద్ర మంత్రిత్వ శాఖలో , రాష్ట్ర గవర్నర్ కు సలహా దారునిగా పని చేస్తున్నారు. అంతేకాక ఆయన కింది స్థాయి నుండి ఉన్నత స్థాయికి  ఎదిగారు.  నిరాడంబరత్వము , మృదు స్వభావి , నిజాయితీకి మారు పేరుగా నిలిచినందుకు గుర్తింపుగా…  మంత్రాలయ పీఠాధి పతి , “మంత్రాలయ పరిమళ ప్రశస్తి “   ప్రముఖ అవార్డును  అందజేసినట్లు భాను శంకర్​ వివరించారు. కార్యక్రమంలో ఏవిహారు, కన్నడ ప్రముఖ నటుడు శ్రీ రమేష్ అరవిందు పాల్గొన్నారు. గతము లో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి శ్రీమతి సుధా మూర్తి మరియు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు , ప్రముఖ సినీ నటులు రజిని కాంత్ తదితరులు ఈ అవార్డు దక్కించుకున్నారు.

About Author