PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌రిష‌త్ ఎన్నిక‌లు .. 90 శాతం ఓట్లు బీజేడీకే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిశాలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ బిజూ జనతా దళ్ పార్టీ విజయకేతనం ఎగరేసింది. రాష్ట్రంలోని 30 జిల్లాలనూ బీజేడీ కైవసం చేసుకుంది. మొత్తం 852 స్థానాలకు జరిగిన పోలింగ్‌లో తుది ఫలితాలు విడుదలయ్యే నాటికి 766 స్థానాలు బీజేడీ ఖాతాలో పడిపోయాయి. ఇతర పార్టీలన్నీ మిగతా స్థానాల్లో తమ వాటాను పంచుకున్నాయి. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు సైతం ఎక్కువ స్థానాల్లో గెలవలేకపోయారు. 90 శాతం సీట్లను బీజేడీ గెలిచి ఘనమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భారతీయ జనతా పార్టీ 42 స్థానాలు గెలుచుకుంది. ఇక మూడవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలను సాధించింది. స్వతంత్రులు, ఇతర పార్టీలు కలిపి ఏడు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగాయి.

                                

About Author