NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘పరిషత్​’ ఎన్నికల్లో.. వైసీపీ ప్రభంజనం : ఎంపీ డా. సంజీవ్​ కుమార్​

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిందని, సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే పరిషత్​ ఎన్నికల్లో అఖండ విజయం తెచ్చిపెట్టాయన్నారు ఎంపీ డా. సంజీవ్​ కుమార్​. జిల్లాలో గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు సోమవారం కర్నూలు ఎంపీ కార్యాలయంలో పార్లమెంట్​ సభ్యులు డా. సంజీవ్​ కుమార్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీ డా. సంజీవ్​ కుమార్​ మాట్లాడుతూ పరిషత్​ ఎన్నికల్లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా విజయదుందుభి మోగించిందన్నారు.

ప్రజా, రైతుల సంక్షేమమే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. గతంలో సర్పంచ్‌ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులకు ప్రజలు పట్టం కట్టారన్నారు. గ్రామీణ ఓటర్లే కాకుండా మునిసిపల్‌ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు కూడా జగన్‌ వైపే నిలిచారని తెలిపారు. కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్​ మండలం ఎంపీటీసీలు, ఎంపీపీ అభ్యర్థి పోలకల్​ మునెప్ప, వివిధ మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఎంపీ డా. సంజీవ్​ కుమార్​ను కలిసిన వారిలో ఉన్నారు.

About Author