NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ధర్మవరంలో పరిటాల శ్రీరాం నిరాహార దీక్ష

1 min read

పల్లెవెలుగువెబ్ : టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్షకు దిగారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దును నిరసిస్తూ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. జిల్లాల పునర్విభజన, ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు చేయడం ఆటవిక విధానంగా ఉందన్నారు. ఏసీ రూముల్లో కూర్చుని విజయవాడలో నిర్ణయం చేయడం సమంజసం కాదని అన్నారు. ప్రజలకు ఏది అనుకూలమో కూడా ఆలోచించాలని.. ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు వల్ల 8 మండలాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఎక్కడ కళ్యాణదుర్గం… ఎక్కడ రామగిరి కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్‌లో రామగిరి ఏ విధంగా కలుపుతారని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రెవెన్యూ డివిజన్‌లో మార్పు జరిగిందని పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యానించారు.

        

About Author