NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పార్ల‌మెంట్.. స్మార్ట్ ఫోన్ సుత్తితో ప‌గ‌లగొట్టిన ఎంపీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: డిజిటల్ మాధ్యమంలో తప్పుడు సమాచార వ్యాప్తిని నేరంగా పరిగణించే బిల్లును వ్యతిరేకిస్తూ ఓ చట్ట సభ్యుడు సభలోనే స్మార్ట్‌ఫోన్‌ను సుత్తితో పగలగొట్టి నిరసన తెలిపాడు. టర్కీలో జరిగిందీ ఘటన. ఈ బిల్లును ‘అతిపెద్ద సెన్సార్‌షిప్ చట్టం’గా అభివర్ణిస్తూ టర్కీ ప్రతిపక్ష ‘రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ’కి చెందిన ఎంపీ బురాక్స్ ఎర్బే తన స్మార్ట్‌ఫోన్‌ను సభలోనే సుత్తితో పగలగొట్టారు. కమ్యూనికేట్ చేయడానికి ప్రజలకు మిగిలి ఉన్న ఒకే ఒక్క మాధ్యమాన్ని కూడా దూరం చేస్తే ప్రజలు తమ ఫోన్లను పగలగొట్టడం తప్ప మరో దారిలేదని అన్నారు.

                                             

About Author