PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పార్థసార‌థిరెడ్డి పై కాల్పులు.. వైసీపీ నేత ఆత్మహత్య

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: పులివెందుల మండ‌లం న‌ల్లపురెడ్డి ప‌ల్లిలో కాల్పుల క‌ల‌కలం రేగింది. వైసీపీ నేత ప్రసాద్ రెడ్డి త‌న లైసెన్స్ తుపాకీతో పార్థసారథి రెడ్డి అనే వ్యక్తి మీద కాల్పులు జ‌రిపారు. పార్థసార‌థి రెడ్డి అక్కడిక‌క్కడే మృతి చెందారు. పార్థసారథి రెడ్డి మీద కాల్పుల అనంత‌రం వైసీపీ నేత ప్రసాద్ రెడ్డి త‌న రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహ‌త్య చేసుకున్నాడు. ఇరువురూ అక్కడిక‌క్కడే మ‌ర‌ణించారు. ఇరువురి మ‌ధ్య ఉన్న వ్యక్తిగ‌త గొడ‌వ‌లే కార‌ణ‌మ‌ని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.


About Author