NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రమౌళి

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో జరిగిన గృహప్రవేశ కార్యక్రమంలో నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే వై.ఐజయ్య కుమారుడు నందికొట్కూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపీ సీనియర్ నాయకులు గురువారం మధ్యాహ్నం వై.చంద్రమౌళి పాల్గొన్నారు.గ్రామానికి చెందిన చెవుల సురేష్,ఈదమ్మ ల నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చంద్రమౌళి మరియు ఉప్పలదడియ ఆర్సిఎం విచారణ సహాయ గురువులు థోమాస్ హాజరయ్యారు.వీరు రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించిన అనంతరం సహాయ గురువులు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.అనంతరం చంద్రమౌళిని మరియు సహాయ గురువులను శాలువాలతో కుటుంబ సభ్యులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జాన్,చౌటుకూరు స్వాములు,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author