ఇఫ్తార్ విందులో పాల్గొన్న కర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భరత్
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ నగరంలోని 46వ వార్డు పరిధిలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అమీరుద్దీన్ మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లిం పెద్దలకు పండ్లు తినిపించి రోజా ఉపవాస దీక్షను ఆయన విరమింప చేశారు. అనంతరం వారితో కలిసి టీజీ భరత్ ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ రజాక్, తదితరులు పాల్గొన్నారు.
