PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రంజాన్ ప్రార్థనల్లో పాల్గొంటే ఎంతో పుణ్యం.. టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రంజాన్ ప్రార్థనల్లో పాల్గొంటున్నందుకు తనకెంతో పుణ్యం లభిస్తుందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ అన్నారు. నగరంలోని 50, 51 వార్డుల పరిధిలో ఉన్న టూటౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని పోలీస్ లైన్ మసీదులో ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముందుగా మసీదులో రోజా దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. అనంతరం వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కులమతాలకు అతీతంగా తాము అన్ని మతాలను గౌరవిస్తాముని టిజి భరత్ అన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యూనుస్ బాషా, షేక్ యాసిన్, సులేమాన్, ఇమ్రాన్, అక్బర్, అక్రమ్, నూరుద్దీన్, ఉమర్, ఇస్మాయిల్, రఫిక్, టిడిపి నేతలు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.

About Author