NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పార్టీ విజయానికి సమిష్టిగా కష్టపడాలి… టి.జి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండి పార్టీ విజయానికి కృషి చేయాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. శుక్రవారం నగరంలోని మౌర్య ఇన్లో క్లస్టర్ ఇంచార్జీలు, వార్డు ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, బూత్ ఇంచార్జీలకు కర్నూలు నియోజకవర్గ అబ్జర్వర్ శ్రీనివాసమూర్తితో కలిసి ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టి.జి భరత్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని చెప్పారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చేయాలని సూచించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

About Author