PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోగికి.. వైద్యుడికి ఒకేసారి గుండెపోటు !

1 min read

పల్లెవెలుగు వెబ్​: తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో విషాధ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గుండెపోటుకు గురైన ఓ బాధితుడికి చికిత్స చేస్తుండ‌గా వైద్యుడికి కూడ గుండె పోటు వ‌చ్చింది. దీంతో ఒకేసారి వైద్యుడు, రోగి మృతిచెందారు.  కామారెడ్డి జిల్లా గాంధారి మండ‌లం గుజ్జ‌ల్ తండాకి చెందిన ఓ వ్య‌క్తికి గుండెపోటు వ‌చ్చింది. దీంతో వెంట‌నే స్థానికంగా గాంధారిలోని న‌ర్సింగ్ హోమ్ కు త‌ర‌లించారు. రోగికి చికిత్స చేస్తూ వైద్యుడు కూడ ఒక్క‌సారిగా గుండెపోటుకు గురై కుప్ప‌కూలాడు. కాసేప‌టికే ఇద్ద‌రూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌నతో స్థానికంగా విషాధ చాయ‌లు అలుముకున్నాయి.

https://ssl.gstatic.com/ui/v1/icons/mail/no_photo.pngReplyForward

About Author