PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం జగన్​కు.. పట్టాభి బహిరంగ క్షమాపణ చెప్పాలి

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఆస్పరి: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి పట్టాభికి లేదని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని వైసీపీ మండల కన్వీనర్ రామాంజనేయులు, జిల్లా సంయుక్త కార్యదర్శి గోవర్ధన్ ,జడ్పిటిసి దొరబాబు ,కెడిసిసి జిల్లా బ్యాంక్ డైరెక్టర్ రాఘవేంద్ర డిమాండ్​ చేశారు. బుధవారం కర్నూలు జిల్లా ఆస్పరి గాంధీ పార్క్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నవరత్నాలతోపాటు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డికే దక్కిందన్నారు. అది చూసి ఓర్వ లేక టిడిపి నాయకులు జగన్ ను విమర్శిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పథకం ప్రకారం టీడీపీ మీడియా ప్రతినిధి పట్టాభిరామ్​ సీఎంను విమర్శించారని ఆరోపించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ దుమ్మ నరసింహులు ,మాజీ సొసైటీ చైర్మన్ కేశవ రెడ్డి,సొసైటీ సీఈఓ అశోక్ ,ప్రకాష్ ,తిమ్మప్ప, నాయుడు, శివ, నరసింహ,రంగన్న,వీరేష్ ,పెద్దిరెడ్డి, సుంకన్న, మనోహర్ ,శేఖర్, వైసిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

About Author