NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యోగుల ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించండి.. ఆపస్

1 min read

పల్లెవెలుగు, వెబ్​ విజయవాడ: ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లుకు ప్రభుత్వం నుండి జూలై 2018 నుండి రావాల్సిన కరవు భత్యం ( డి ఎ), పీఆర్సీ బకాయిలు, అలాగే ఇప్పటి వరకు అందని ప్రోవిడెంట్ ఫండ్ రుణాలు, ఆర్జిత సెలవులు, ఏ పి జి యల్ ఐ రుణాలు, ఫైనల్ సెటిల్మెంట్ తదితర ఆర్ధిక బకాయిలును దీపావళి పండుగ సందర్భంగా చెల్లించేలా ముఖ్యమంత్రి సత్వరమే ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించాలని ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీ సి హెచ్ శ్రావణ్ కుమార్, యస్ బాలాజీ లు డిమాండ్ చేశారు. అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి గతంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని ఉన్నత పాఠశాలలకు గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్టులు మంజూరు చేయాలని, బదిలీలు మరియు పదోన్నతులు, హేతబద్ధీకరణ కు సంభందించి ప్రభుత్వ ఉత్తర్వులు 117 ప్రకారం కాకుండా గతంలో ఉన్న నిబంధనల ప్రకారం చేపట్టాలని డిమాండ్ చేశారు.సి హెచ్ శ్రావణ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు యస్ బాలాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author